PK on Rahul | రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతున్నది. ప్రస్తుతం ఆయన కర్ణాల్లో తన నడక కొనసాగిస్తున్నాడు. రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయవేత్తగా మారిన పీకే.. ప్రస్తుతం బిహార్లో జన్ సురాజ్ అభియాన్ పేరుతో పర్యటిస్తున్నారు. కాగా, రాహుల్ పాదయాత్రపై ప్రశాంత్ కిషోర్ (పీకే) సెటైర్లు వేశారు. తానేమీ రాహుల్లా పెద్ద మనిషిని కాదని కూడా చెప్పుకొచ్చారు.
ప్రశాంత్ కిషోర్ బిహార్లోని మోతీహరిలో పాదయాత్ర చేస్తున్నారు. అక్కడ తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్ర జరుపుతున్నారని వ్యాఖ్యానించిన పీకే.. కిలోమీటర్లతో తనకు పట్టింపు లేదన్నారు. గత అక్టోబర్ నుంచి తాను నాన్ స్టాప్గా పర్యాటన కొనసాగిస్తున్నాను, కానీ ఆయనలా ఫిజికల్ ఫిట్నెస్ ప్రదర్శించలేదని విమర్శించారు. పాదయాత్ర చేయడం అంటే ఫిజికల్ ఫిట్నెస్ ప్రదర్శించడమా? అని ప్రశ్నించారు. రాహుల్ మాదిరిగా తానేమి పెద్ద మనిషిని కాదని, ఆయనతో పోల్చితే తాను చాలా చిన్నవాడినన్నారు.
ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జాతీయ స్థాయికి రావాలని భావించారు. నిజానికి కాంగ్రెస్లో చేరే విషయమై పార్టీ అగ్రనాయకత్వంతో మాట్లాడేందుకు ఆయన చేసిన ప్రయత్నాలన్నీ ఫలించలేదు. బిహార్లో పీకేను అవకాశవాది అని ముద్రవేస్తుండగా.. తాను మాత్రం ఛత్ పండుగ మాదిరిగా తపస్సులా జరుపుతున్నానని చెప్తున్నారు. మహాత్మాగాంధీ కాంగ్రెస్ను పునరుద్ధరించేందుకే జన్ సూరజ్ అభియాన్ చేపట్టినట్లు పీకే పేర్కొన్నారు.