వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్వరం మారిపోతోంది. రాహుల్ విషయంలో, కాంగ్రెస్ విషయంతో పాటు తన పాత బాస్, సీఎం నితీశ్ విషయంలో స్వరాన్ని సవరించుకుంటున్నారు. మొన్నటికి మొన్న రాహుల్ ప్రధాని కాలేరని వ్యాఖ్యానించిన పీకే… తాజాగా ఓ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ప్రధాని అయ్యే ఛాన్స్ ఉందని వ్యాఖ్యానించడం గమనించాల్సిన పరిణామం. ఇక… కాంగ్రెస్ లేకుండా కేంద్రంలో ఓ విపక్ష కూటమి మనగలగడం దాదాపు తక్కువే అని తేల్చి చెప్పారు. మొన్నటికి మొన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ లేకున్నా… కేంద్రంలో విపక్ష కూటమి సాధ్యమేనని వ్యాఖ్యానించిన పీకే… ఈ ఇంటర్వ్యూలో మాత్రం భిన్నంగా మాట్లాడేశారు.
ఇక.. సీఎం నితీశ్తో పొసగకపోవడంతో జేడీయూకు పీకే గుడ్బై చెప్పేసిన విషయం తెలిసిందే. అయితే రెండు సార్లు ఎవరితో కలిసి పనిచేయాలని మీరు భావిస్తున్నారు? అని ఆ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా… ఠక్కుమని బిహార్ సీఎం నితీశ్తో అని పీకే పేర్కొన్నారు. ఇప్పటికీ నితీశ్తో మాట్లాడతారా? అని ప్రశ్నించగా… మాట్లాడుకోవడం జరుగుతూనే ఉంటుంది అని వెల్లడించారు. అయితే పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్తో మాత్రం పని చేయడం ఏమాత్రం నచ్చదని నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు. ఇక… గాంధీ పరివారంలోని వ్యక్తులు లేకపోయినా… కాంగ్రెస్ మనుగడ సాధ్యమేనని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.