Sabarimala | శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. రద్దీ ఎక్కువ కావడంతో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు 20 గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూలైన్ల నిర్వహణలో అధికారులు విఫలమయ్యారు. ఈ కారణంగా ఎంతసేపు లైన్లో నిల్చున్న దర్శనం కావడం లేదు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నారు. శబరిమల వెళ్లేందుకు కూడా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల రద్దీ కారణంగా భారీ ట్రాఫిక్జామ్ అవ్వడంతో పంబ చేరుకుని తిరిగి వెళ్లాలంటే చాలా కష్టమవుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ట్రావెన్కోర్ అధికారుల వైఫల్యంపై సీఎం పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల కోసం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమల రావడం వల్ల తీవ్ర ఇబ్బంది ఏర్పడిందని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.
Hindu pilgrims to Sabarimala treated like dirt. Upset at their plight Kerala HC orders Pinarayi government to make necessary arrangements.
Of course, in Kerala, taxpayer money is spent like water on a Hajj committee tasked with making plush arrangements for travel to Mecca. pic.twitter.com/5mQk50u0Jf— Rahul Shivshankar (@RShivshankar) December 13, 2023