జనగామ : గురువారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షంతో జిల్లా కేంద్రంలోని జనగామ వ్యవసాయ మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన దాదాపు వెయ్యి బస్తాల ధాన్యం తడిసి ముద్దయింది. కొద్దిరోజులుగా యాసంగి పంటలు కోస్తున్న రైతులు ధాన్యం అమ్మకం కోసం వ్యవసాయ మార్కెట్ లోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొచ్చారు.
తేమ శాతంఎక్కువ ఉండడంతో యార్డ్ ఆవరణలో ఆర పెడుతున్నారు. ఈ క్రమంలో గురువారం కురిసిన వర్షంతో పెద్దఎత్తున ధాన్యం రాశులు, తూకం అయిన సంచులు నీటమునిగాయి.
అయితే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ విజయ భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
సెల్ఫీ దిగుతూ.. వాగులో పడి యువకుడు మృతి
రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి
ఇక ప్రాణవాయువుకు ఇబ్బందుల్లేవు : మంత్రి పువ్వాడ
జ్వర సర్వేను పరిశీలించిన మంత్రి వేముల
కరోనా కట్టడికి పటిష్ట చర్యలు : మంత్రి అల్లోల