న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుతున్న పీహెచ్డీ విద్యార్థిని లైంగికంగా వేధించారు. జేఎన్యూ క్యాంపస్లో ఈ ఘటన జరిగింది. మహిళా విద్యార్థిని వేధించినట్లు తమ ఫిర్యాదు అందినట్లు వసంత్ కుంజ్ పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి 12.45 నిమిషాలకు తమ పోలీస్ స్టేషన్కు పీసీఆర్ కాల్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదు అందిన వెంటనే డీసీపీ గౌరవ్ శర్మతో పాటు స్టేషన్ ఆఫీసర్ ఆ ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి 11.45 గంటలకు పీహెచ్డీ విద్యార్థిని క్యాంపస్లో తిరుగుతున్న సమయంలో.. యూనివర్సిటీ ఈస్ట్ గేట్ నుంచి బైక్పై వచ్చిన ఓ వ్యక్తి ఆమెను వేధించినట్లు శర్మ చెప్పారు. ఆ మహిళ అరుపులు చేయగానే.. నిందితుడు పరారీ అయ్యాడు. వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్లో వేధింపు కేసును బుక్ చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.