Lok Sabha Elections | దేశ వ్యాప్తంగా ఐదో విడుత ఎన్నికలకు పోలింగ్ (Lok Sabha Elections 2024) ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట వరకూ 36.73 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
అత్యధికంగా లఢక్లో 52.02 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఇక పశ్చిమ బెంగాల్లో 48.41 శాతం, జార్ఖండ్లో 41.89 శాతం, బీహార్లో 34.62 శాతం, జమ్మూ కశ్మీర్లో 34.79 శాతం, ఒడిశాలో 35.31 శాతం, యూపీలో 39.55 శాతం, మహారాష్ట్రలో 27.78 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.