న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభించనున్న కొత్త మొబైల్ యాప్ను ఉపయోగించుకుని యూపీఐ పేమెంట్ గేట్వే ద్వారా తమ బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఉద్యోగుల భవిష్య నిధిని(ఈపీఎఫ్) సబ్స్ర్కైబర్లు విత్డ్రా చేసుకోవచ్చని ఉన్నత వర్గాలు తెలిపాయి. ఈపీఎఫ్లో కొంత నిష్పత్తిని స్తంభింప చేయనుండగా మిగిలిన భాగాన్ని యూపీఐని ఉపయోగించి తమ బ్యాంకు ఖాతాల్లోకి సబ్స్ర్కైబర్లు విత్డ్రా చేసుకునే విధంగా ఓ ప్రాజెక్టును కార్మిక శాఖ రూపొందిస్తున్నట్లు వారు చెప్పారు.
ఈపీఎఫ్వో కొత్త మొబైల్ ఫోన్ యాప్ను తీసుకువస్తుందని, యూపీఐని ఉపయోగించి సభ్యుడు బ్యాంకు ఖాతాల్లోకి ఈపీఎఫ్ సొమ్ము విత్డ్రా చేసుకోవడంతోపాటు పాస్బుక్ బ్యాలెన్స్ వంటి ఇతర సేవలు కూడా పొందవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈపీఎఫ్వో సభ్యులకు యూనివర్సల్ అకౌంట్ నంబర్(యూఏఎన్) పోర్టల్ లేదా ఉమంగ్ యాప్ ద్వారా తమ ఈపీఎఫ్ ఖాతా లు అందుబాటులోకి వస్తున్నాయి.