న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటింది. గత రెండు నెలల నుంచి వరుసగా ఇంధన ధరలను పెంచుతున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. బుధవారం కూడా ధరలను పెంచాయి. లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 17 పైసలను పెంచడంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.100.21కి పెరిగింది. డీజిల్ ధర రూ.89.53కి చేరింది. ఇదే సమయంలో కోల్కతాలో కూడా బుధవారం లీటరు పెట్రోల్ ధర రూ.100.23కి ఎగబాకింది. మరోవైపు ప్రతినెలా చివరి ఆదివారాల్లో ప్రధాని మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’ బదులు ‘పెట్రోల్, వ్యాక్సిన్ కీ బాత్’ నిర్వహించాలని బెంగాల్ సీఎం మమత ఎద్దేవా చేశారు.