న్యూఢిల్లీ, అక్టోబర్ 31: పెట్రోల్, డీజిల్ ధరలపై లీటర్కు 40 పైసలు తగ్గనున్నది. కొత్త ధరలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దాదాపు గత ఏడు నెలల తర్వాత ఈ స్వల్ప తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఆ లబ్ధిని సామాన్యుడికి ఇవ్వకపోగా.. వరుసగా ధరల పెంపుతో ప్రజల నడ్డి విరిచిన విషయం తెలిసిందే. అయితే త్వరలో గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పెట్రోల్, ధరల తగ్గింపును చేపట్టడం గమనార్హం.