Fuel Price Cut | న్యూఢిల్లీ, మార్చి 14: లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం వరాల వర్షం కురిపిస్తున్నది. మొన్నటికి మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్యాస్ సిలిండర్పై రూ.100 తగ్గించిన కేంద్రం.. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గించింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి గురువారం ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
తగ్గించిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. ఇంధన ధర రూ.2 తగ్గించటం ద్వారా కోట్లాది మంది భారతీయుల కుటుంబాలను మోదీ ఆదుకున్నారని సెలవిచ్చారు. వాస్తవానికి అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ కేంద్రం పెట్రో రేట్లను తగ్గించని విషయం తెలిసిందే.