న్యూఢిల్లీ, జూన్ 20: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ పిటిషన్ వేశారు. సైన్యంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రిక్రూట్మెంట్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని కోర్టుకు తెలిపారు.
అగ్నిపథ్ పథకానికి పార్లమెంట్ ఆమోదం లేదని, ఇదే సమయంలో ఇది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అగ్నిపథ్కు సంబంధించి కేంద్రం ఈ నెల 14న చేసిన ప్రకటనను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువత చేస్తున్న ఆందోళనలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.