న్యూఢిల్లీ: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గురువారం కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల ఐక్యత దిశగా వీరి మధ్య చర్చలు జరిగాయి. బుధవారం బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా ఖర్గే, రాహుల్ గాంధీతో సమావేశమై ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంపై చర్చించారు.
ఇదే అంశంపై గురువారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజాతోనూ నితీశ్ కుమార్ భేటీ అయ్యారు.