పాట్నా: బీహార్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల ఆధారిత సర్వేను వెంటనే నిలిపివేయాలని పాట్నా హైకోర్టు గురువారం ఆదేశించింది. కుల సర్వేను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన చీఫ్ జస్టిస్ వినోద్చంద్రన్, జస్టిస్ మధురేశ్ ప్రసాద్ ధర్మాసనం ప్రభుత్వం కుల ఆధారిత సర్వేను వెంటనే నిలిపివేయాలని, ఇప్పటివరకు ఈ సర్వే ద్వారా సేకరించిన వివరాలను ఎవరితో పంచుకోకుండా తాము తుది ఆదేశాలు ఇచ్చేవరకు భద్రంగా ఉంచాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 7న నిర్వహిస్తామని తెలిపింది.