న్యూఢిల్లీ: పాస్పోర్ట్ సేవా ప్రోగ్రాం-వెర్షన్ 2.0లో భాగంగా భారత్లో సరికొత్త, అప్గ్రేడ్ చేసిన ‘ఈ-పాస్ట్పోర్ట్’లను తీసుకురాబోతున్నామని విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు. శనివారం పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా ఆయన దేశవిదేశాల్లోని పాస్పోర్ట్ జారీ కేంద్రాల ఉద్యోగులతో మాట్లాడుతూ ఈవిషయాన్ని వెల్లడించారు.
డిజిటల్ ఎకో సిస్టమ్, ఏఐ టెక్నాలజీ, చిప్ ఆధారిత ఈ-పాస్ట్పోర్ట్స్ను జారీచేస్తామన్నారు. పాస్ట్పోర్ట్ సేవల్ని ప్రజలకు మరింతగా అందుబాటులోకి తెస్తామన్నారు. సమాచర భద్రతను పెంచుతామన్నారు.