న్యూఢిల్లీ, డిసెంబర్ 23: సాంకేతిక సమస్య అని, ఇంకేదో కారణం చెప్పి విమానాలు రద్దు చేసే సందర్భాలు కోకొల్లలు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానయాన సంస్థలు ఇలా ఇష్టారీతిన విమానాలను రద్దు చేయటంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందటంతో అప్రమత్తమైంది.
ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా మార్గదర్శకాలు తీసుకురాబోతున్నది. విమానం రద్దు చేస్తే విమానయాన సంస్థలు రూ.10 వేల వరకు ప్రయాణికుడికి పరిహారం చెల్లించేలా నిబంధనలు తీసుకొస్తున్నది. అటు.. ఎక్కువ క్లాస్ టికెట్ బుక్ చేసుకొన్న ప్రయాణికుల సమ్మతి లేకుండా తక్కువ క్లాస్కు మార్చితే వారికి విమానయాన సంస్థలు పరిహారం చెల్లించేలా నిబంధన తేనున్నది.
మార్గదర్శకాలు ఇవీ: