చెన్నై : తమిళనాడులో సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ప్రయాణీకులకు శవంతోనే దాదాపు 600 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. రైలు జనరల్ కోచ్లో ఓ వ్యక్తి మరణించడంతో ప్రయాణీకులు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా రైల్వే అధికారులు పట్టించుకోకపోవడంతో శవంతోనే ప్రయాణీకులు సుదీర్ఘ ప్రయాణం సాగించారు.
రైలు చెన్నై నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళుతున్న క్రమంలో చెన్నైలో పనిచేసే యూపీలోని బందా జిల్లాకు చెందిన రంజీత్ యాదవ్ మార్గమధ్యలో మరణించాడు. ప్రయాణీకులు రైల్వే అధికారులకు సమాచారం అందించినా రైలు యూపీలోని ఝాన్సీకి చేరేవరకూ మృతదేహాన్ని తొలగించలేదు. రంజిత్ యాదవ్ అస్వస్ధతతో బాధపడుతూ తన బావమరిది గోవర్ధన్ సాయంతో స్వస్ధలానికి వెళుతున్నాడు.
రైలు నాగ్పూర్కు చేరుకునేసరికి తీవ్ర అస్వస్ధతకు లోనైన రంజిత్ హఠాన్మరణానికి గురయ్యాడు. రైల్వే అధికారులకు పలుమార్లు ప్రయాణీకులు సమాచారం అందించినా వారు పట్టించుకోకపోవడంతో రంజిత్ మృతదేహంతోనే వారు ఏకంగా దాదాపు 600 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది.
Read More :
Delhi Air Pollution | ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం.. పంజాబీ బాగ్లో 460కి చేరిన ఏక్యూఐ