ముంబై: మహారాష్ట్రలో పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ముంబై వదిలి తమ స్వస్థలాలకు వెళ్లిపోవడానికి రైల్వే స్టేషన్ల ముందు జనం భారీగా క్యూ కడుతున్నారు. బుధవారం ఉదయం లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) రైల్వే స్టేషన్ ముందు జనం క్యూ కట్టారు. భయం వద్దు, రైల్వే స్టేషన్లకు భారీ సంఖ్యలో రావొద్దు అని సెంట్రల్ రైల్వే కోరుతున్నా జనం ఆందోళనకు గురవుతున్నారు.
పెద్ద ఎత్తున స్టేషన్కు వస్తున్న ప్రయాణికులను నియంత్రించడానికి ఎల్టీటీ స్టేషన్ దగ్గర రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సహా రైల్వే పోలీసులను అదనంగా మోహరిస్తున్నారు. వచ్చే 15 రోజుల పాటు మహారాష్ట్రలో కఠిన ఆంక్షలు అమలు కానున్న సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి 8 గంటలకు అమల్లోకి వచ్చే ఈ ఆంక్షలు, మే 1 ఉదయం 7 గంటల వరకూ ఉండనున్నాయి. రాష్ట్రం మొత్తం 144 సెక్షన్ విధించారు. దీంతో ఆలోపే ముంబై విడిచి వెళ్లిపోవడానికి రైల్వే స్టేషన్ల దగ్గరికి ప్రజలు తరలివస్తున్నారు. ముఖ్యంగా వలస కార్మికులు మహారాష్ట్ర నుంచి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు.
ఇవి కూడా చదవండి
శంకర్తో రణ్వీర్.. అపరిచితుడు హిందీ రీమేక్
స్విగ్గీని నిషేధించాలంటున్న రోహిత్ శర్మ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ
వెనక్కి తగ్గిన అమెరికా.. భారత్తో భాగస్వామ్యాన్ని గౌరవిస్తామని ప్రకటన
కుంభమేళాను మర్కజ్తో పోల్చవద్దు..
1,84,372 కేసులు.. 1027 మరణాలు.. కరోనా విలయ తాండవం
రాష్ట్రంలో కొత్తగా 2157 కరోనా కేసులు
హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి.. రాష్ట్రపతి, ప్రధాని నివాళి