Congress | ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సుశీల్ చంద్ర ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ స్పందించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా తమ పార్టీ పూర్తి సంసిద్ధతతోనే ఉందని పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు, యువత, మహిళలతో పాటు ఇతర వర్గాల విషయంలో పోరాడడానికి తాము పూర్తి సంసిద్ధతతోనే ఉన్నామని పేర్కొన్నారు.
బీజేపీ వైఫల్యాలపై పోరాడడానికి తాము సదా సిద్ధంగానే ఉంటామన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కలగడం మొదలుకొని, చైనా దురాక్రమణ వరకూ అన్ని వైఫల్యాలపై పోరాడడానికి సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించిందని, తాము సిద్ధంగానే ఉన్నామని, తమని ఆదరించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నట్లు కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.