న్యూఢిల్లీ, జూన్ 10: పదే పదే జరుగుతున్న నీట్-యూజీ పేపర్ లీక్లపై పార్లమెంటరీ ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా ఒక్కసారి మాత్రమే కాకుండా.. ఒక ఏడాదిలో పలుమార్లు నిర్వహించే అవకాశాలపై ప్యానెల్ చర్చించింది. దీనివల్ల విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా ఉంటారని ప్యానెల్ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది నీట్-యూజీ పరీక్ష పత్రం లీకేజీపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ), జాతీయ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) సభ్యులతో పార్లమెంట్ ప్యానెల్ సుదీర్ఘంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఎన్టీఏ, ఎన్ఎంసీ ప్రతినిధులను విచారించింది. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకుగాను కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, ఏడాదికి పలుమార్లు నీట్ నిర్వహించటం వంటి సంస్కరణలపై ప్యానెల్ సభ్యులు చర్చించారు.