Public Exam Bill | న్యూఢిల్లీ: పోటీ పరీక్షల్లో అవకతవకలను అరికట్టేందుకు రూపొందించిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 6నే ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలుపగా.. తాజాగా శుక్రవారం రాజ్యసభ ఆమోదించింది.
పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారికి గరిష్ఠంగా పదేండ్ల జైలు, కోటి రూపాయల దాకా జరిమానా విధించేలా ఈ బిల్లు రూపొందించారు. రాజ్యసభలో ఈ బిల్లుకు కొందరు ప్రతిపక్ష సభ్యులు సూచించిన సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. అనంతరం బిల్లు ఆమోదం పొందింది.