పనీర్, పాలు, పెరుగు, గోధుమ పిండి, బియ్యం మొదలైన రోజువారీ ఆహార పదార్థాలతో సహా అనేక వస్తువులపై ఇటీవల జీఎస్టీ విధించారు. ఈ ఆహార పదార్థాలన్నీ ఇప్పుడు 5 శాతం శ్లాబ్లోకి వస్తాయి. దీని కారణంగా పనీర్, ఇతర పాల ఉత్పత్తులు ఇక నుంచి మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటికే హోటల్స్లో పనీర్ వంటకాలు చాలా ఖరీదైనవి. ఇకనుంచి మరింత ధర పెరుగనుండడంతో ఆహారప్రియులు విలవిల్లాడుతున్నారు.
షాహీ పనీర్ లేదా పనీర్ కోఫ్తా కాకుండా పనీర్ బటర్ మసాలా ఇంకా ప్రియం కానుంది. అందుకే ఇప్పుడు అది ట్విటర్లో ట్రెండింగ్లో ఉంది. అదెలా అంటారా? చీజ్, మసాలాపై జీఎస్టీ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. పనీర్, చీజ్, మసాలాపై 5 శాతం, 12 శాతం, 5 విధించిన పన్నును పరిగణనలోకి తీసుకుని, పనీర్ బటర్ మసాలా డిష్ కొత్త ధర ఎంతో లెక్కించాలని ఓ యూజర్ మిగతా నెటిజన్లకు సవాల్ విసిరారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. #పనీర్బటర్మసాలా ట్విట్టర్లో ట్రెండింగ్ అయిన తర్వాత, నెటిజన్లు ఇతర ఉల్లాసకరమైన మీమ్స్, జోక్లతో పాటు తమ సమాధానాలను పంచుకున్నారు.
GST on Paneer: 5%
GST on Butter: 12%
GST on Masala: 5%New Maths Question: Calculate the GST of Paneer Butter Masala 😛😀😅#WAFwd
— Fundamental Investor ™ 🇮🇳 (@FI_InvestIndia) July 20, 2022