శ్రీనగర్: జమ్ముకశ్మీర్ కతువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతా బలగాలు పాకిస్థాన్ డ్రోన్ను (Drone) కూల్చివేశాయి. ఆదివారం ఉదయం కతువా జిల్లాలోని తల్లి హరియా చాక్ ప్రాంతంలో ఓ డ్రోన్.. అంతర్జాతీయ సరిహద్దులు దాటుకుని దేశంలో ప్రవేశించింది. అక్కడ గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు దానిని గుర్తించారు. దీంతో ఆ డ్రోన్పై కాల్పులు జరపడంతో అది కూలిపోయింది. ఆ డ్రోన్ పేలోడ్ను తీసుకువస్తున్నదని, ప్రస్తుతం బాంబు నిర్వీర్య దళం దానిని పరిశీస్తున్నదని పోలీసులు తెలిపారు. సరిహద్దుల్లో గత కొంత కాలంగా డ్రోన్ల కదలికలు ఎక్కువవడంతో ఆయా ప్రాంతాల్లో నిరతరం నిఘా ఉంచామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో డ్రోన్కు కూల్చివేశామన్నారు.