శ్రీనగర్: భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాక్ సైనికులు (Pakistan) వరుసగా 12వ రోజూ కొనసాగాయి. జమ్ముకశ్మీర్లోని 8 సెక్టార్లలో సోమవారం రాత్రి కాల్పులకు తెగబడింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరీ, మెంధార్, నౌషెరా, సుందర్బని, అఖ్నూర్ సెక్టార్లలో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. దీనికి భారత సైనికులు దీటుగా బదులిచ్చారు.
ఏప్రిల్ 22న శ్రీనగర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత.. పాకిస్థాన్కు సింధూ జలాలను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతున్నది.
ఉగ్రవాద స్థావరం గుట్టు రట్టు
జమ్ము కశ్మీర్లోని పూంఛ్ జిల్లా, సురాన్కోట్లో ఉగ్రవాద స్థావరాన్ని భద్రతా దళాలు, పోలీసులు గుర్తించారు. పహల్గాం ఉగ్రవాదుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు జరుపుతుండగా, ఉగ్రవాద స్థావరం బయటపడింది. టిఫిన్ బాక్సుల్లో మూడు, స్టీల్ బకెట్లలో రెండు ఐఈడీలను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.