జమ్మూకశ్మీర్ : సరిహద్దుల నుంచి భారత్లోకి అక్రమంగా డ్రగ్స్ తరలించేందుకు యత్నిస్తుండగా.. బీఎస్ఎఫ్ అడ్డుకున్నది. వేకువ జామున అంతర్జాతీయ సరిహద్దు వెంట చిల్లియారి సరిహద్దు అవుట్ పోస్ట్ సమీపంలో అనుమానాస్పద కదలికలను బీఎస్ఎఫ్ దళాలు గమనించినట్లు బీఎస్ఎఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి తెలిపారు. ఓ వ్యక్తి బ్యాగ్తో కనిపించాడని, దీంతో సైనికులు కాల్పులు జరపగా.. చొరబాటుదారుడికి గాయాలయ్యాయని పేర్కొన్నారు.
ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా.. ఎనిమిది కిలోల మాదకద్రవ్యాలతో కూడిన ప్యాకెట్లను గుర్తించినట్లు పేర్కొన్నారు. గాయపడ్డ చొరబాటుదారుడు మళ్లీ పాక్ వైపుగానే పారిపోయాడని పేర్కొన్నారు. ప్యాకెట్లో ఉన్నది హెరాయిన్ కావొచ్చునన్నారు. ఇదిలా ఉండగా.. బుధవారం రాజౌరి జిల్లాలో పాక్ ఉగ్రవాదిని బలగాలు పట్టుబడ్డ విషయం తెలిసిందే. భారత ఆర్మీ పోస్ట్పై దాడి చేసేందుకు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన కల్నల్ తనకు 30వేల పాక్ కరెన్సీ ఇచ్చినట్లుగా తెలిపాడు. సదరు వ్యక్తి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లి సబ్జ్కోట్ గ్రామానికి చెందిన తబారక్ హుస్సేన్ (32)గా గుర్తించారు.