సీడీఎస్ బిపిన్ రావత్ దుర్మరణంపై దాయాది పాకిస్తాన్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఆర్మీ ఉన్నతాధికారులు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ వార్త విని తాము షాక్కు గురయ్యామని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. పాక్ ఆర్మీ చీఫ్ బాజ్వా, చైర్మన్ ఆఫ్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ జనరల్ నదీమ్ రజా ఈ ఘటనపై తమ సంతాపాన్ని ప్రకటించారు. రావత్ తో పాటు హెలికాప్టర్లో ఉన్న వారి మృతికి కూడా సంతాపం తెలిపారు.