న్యూఢిల్లీ : భారత్తో జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు ప్రత్యేక అనుబంధం ఉంది. భారత్ యొక్క రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ను 2021లో అబేకు ప్రకటించింది. 2014లో యూపీఏ గవర్నమెంట్లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు షింజో అబే హాజరయ్యారు. 2015లో ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహించిన వారణాసి నియోజకవర్గానికి అబే కుటుంబ సమేతంగా వచ్చారు. నాడు వారణాసిలో గంగా ఆర్తి కార్యక్రమంలో అబే పాల్గొన్నారు.
మళ్లీ రెండేండ్లకు అబే ప్రధాని హోదాలో అహ్మదాబాద్ను సందర్శించారు. ఇండియా ఫస్ట్ బుల్లెట్ ట్రెయిన్ ఫౌండేషన్ కార్యక్రమంలో అబే పాల్గొన్నారు. 2007లో భారత పార్లమెంటు సంయుక్త సమావేశంలో అబే ప్రసంగిస్తూ తన తాత నోబుసుకే కిషికి 1957లో ఇండియాకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ.. తన తాతకు ఢిల్లీలో ఆతిథ్యం ఇచ్చారని అబే గుర్తు చేసుకున్నారు.