న్యూఢిల్లీ : గుజరాత్ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నడపడం లేదని.. ఢిల్లీ నుంచి నడుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం విమర్శించారు. గుజరాత్ మోర్బీ ఘటన నేపథ్యంలో.. బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మోర్బీ వంతెన ఘటన గుజరాత్కే తలవంపులు తెచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వంతెన ప్రమాదంపై ఇప్పటి వరకు ఎవరూ ప్రభుత్వం పక్షాన క్షమాపణలు చెప్పలేదని, దానికి ఎవరూ బాధ్యత వహించక పోవడం అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయమన్నారు. ఇటీవల మోర్బీలో వంతెన కూలిన ఘటనలో 135 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మరో వైపు చిదరంబరం ఆమ్ ఆద్మీ పార్టీపై సైతం విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో గాలి నాణ్యతపై నమ్మకం ఉంటే.. గుజరాత్లో అరవింద్ కేజ్రీవాల్కు ఓటు వేయరన్నారు.