హైదరాబాద్ : మణిపూర్లో (Manipur Violence) ఇటీవల ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వెలుగుచూడటం పట్ల నరేంద్ర మోదీ సర్కార్ లక్ష్యంగా ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు గుప్పించారు. మణిపూర్ వీడియో కుట్రపూరితమైనదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడం సిగ్గుచేటని ఓవైసీ మండిపడ్డారు.
మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో మణిపూర్ వీడియోను కొందరు కుట్రపూరితంగా లీక్ చేశారని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.గత రెండు నెలలుగా మణిపూర్ భగ్గుమంటున్న క్రమంలో ఈ పాత వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవగా, వీడియో వెలుగుచూసిన తర్వాతే నిందితులపై చర్యలు చేపట్టడం గమనార్హం.
మోదీ ప్రభుత్వం కుకీ మహిళల గౌరవం గురించి కాకుండా ఎన్నడూ తన ప్రభుత్వ ప్రతిష్ట కోసమే పాకులాడుతుందని ఇది సిగ్గుచేటని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్లో రాసుకొచ్చారు.
Read More :
Singapore: డ్రగ్స్ కేసుతో లింకున్న మహిళను ఉరితీసిన సింగపూర్