Madhya Pradesh | భోపాల్ : పెళ్లి వేడుక నేపథ్యంలో ఊరేగింపుగా వెళ్తున్న జనాలపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రైజిన్ జిల్లాలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకుంది.
విరవాల్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి ఓ పెళ్లి బృందం హోసంగాబాద్ జిల్లా నుంచి రైజిన్ జిల్లాలోని సుల్తాన్పూర్ ఏరియాకు చేరుకుంది. దీంతో సుల్తాన్పూర్లో నూతన వధూవరులతో ఊరేగింపుగా బయల్దేరారు. అదే సమయంలో ఓ ట్రక్కు వేగంగా వచ్చి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం భోపాల్ తరలించాలని అధికారులు ఆదేశించారు.
ఈ ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
#WATCH | Raisen, Madhya Pradesh: Six died and 10 others were injured after an uncontrolled trolley rammed into a wedding procession: Collector Arvind Kumar Dubey pic.twitter.com/QUkAxbJcJR
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 11, 2024