న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ రైలులో లగేజీ స్థలం విషయంపై ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. (Fight In Vande Bharat Train) చివరకు పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వందే భారత్ రైలులో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు లగేజీ స్థలంపై వాగ్వాదానికి దిగారు. ఒకరిపై మరొకరు అరుచుకున్నారు. ఒక వ్యక్తికి మద్దతుగా ఒక మహిళ కూడా వాదనకు దిగింది. ఇది చూసి కొందరు ప్రయాణికులు వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. వాగ్వాదం తీవ్రం కావడంతో రైల్వే పోలీస్ ఆ కోచ్లోకి వచ్చాడు. లగేజి స్థలం విషయంపై గొడవకు దిగిన వారికి సర్దిచెప్పాడు.
కాగా, ఒక ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. వందే భారత్ రైళ్లలో ప్రయాణికుల మధ్య గొడవ సర్వ సాధారణమైందని ఒకరు కామెంట్ చేశారు. లగేజ్ విషయంలో పరిమితి విధించాలని మరొకరు సూచించారు. విమానాలు రైళ్లు అయ్యాయని, రైళ్లు బస్సులుగా మారాయని ఒకరు చమత్కరించారు.
Kalesh b/w Two Uncle inside Vande bharat train over Bag Spot pic.twitter.com/YD4uJSxQfh
— Ghar Ke Kalesh (@gharkekalesh) January 16, 2024