న్యూఢిల్లీ: విమానం సుమారు మూడు గంటలు ఆలస్యంగా టేకాఫ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు, విమాన సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. స్పైస్జెట్కు చెందిన విమానం షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం 7.20 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి పాట్నాకు బయలుదేరాల్సి ఉంది. అయితే తొలుత వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం టేకాఫ్ ఆలస్యం అవుతుందని సిబ్బంది తెలిపారు. గంట తర్వాత సాంకేతిక సమస్యల వల్ల విమానం ఆలస్యంగా బయలుదేరుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో విమానంలోకి ఎక్కి రెండున్నర గంటలకుపైగా నిరీక్షించిన ప్రయాణికులు ఆగ్రహంతో రగిలిపోయారు. స్పైస్జెట్ సిబ్బందిపై తమ అసంతృప్తి వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఉదయం 10.10 గంటలకు ఆ విమానం టేకాఫ్ అయ్యింది.
కాగా, ఇటీవల ఫూణె నుంచి అహ్మదాబాద్ వెళ్లాల్సిన స్పైస్జెట్ విమాన ప్రయాణికులు ఐదు గంటలు వేచి ఉన్నారు. చివరకు ఎలాంటి కారణం చెప్పకుండా ఆ ఫ్లైట్ను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. సుమారు 8 గంటలపాటు పూణె ఎయిర్పోర్ట్లో ఉన్న ప్రయాణికులు, విమానం రద్దుతో చివరకు ఇళ్లకు తిరిగి వెళ్లారు.