ఆగ్రా, జూలై 16: ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో 9 వేల మందికి పైగా చనిపోయిన రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు బదిలీ అయ్యాయి. వ్యవసాయ శాఖ అధికారులు చేపట్టిన లబ్ధిదారుల రీవెరిఫికేషన్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
9,284 మంది చనిపోయిన రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయినట్టు ఈ-కేవైసీ ప్రక్రియలో తేలింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, రికవరీ నోటీసులు జారీచేశామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హరినాథ్ సింగ్ శుక్రవారం పేర్కొన్నారు.