ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యింగ్కియాంగ్లోని మార్కెట్ ఏరియాలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో 30కి పైగా ఇండ్లు, దుకాణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సుమారు 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. సాయంత్రం 6 గంటల సమయంలో మంటలు అదుపులోకి వచ్చినట్లు అప్పర్ సియాంగ్ డిప్యూటీ ఎస్పీ ఓపిర్ పారాన్ తెలిపారు. ఈ ప్రమాదంతో సుమారు రూ. 5 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.
#WATCH | Troops of Spear Corps, Arunachal Scouts and Border Roads Task Force (BRTF) assisted civil administration to save locals from a raging fire in Yingkiong in Upper Siang district of Arunachal Pradesh, yesterday, April 21.
(Video source: Army) pic.twitter.com/Xh1d86Wov4
— ANI (@ANI) April 21, 2022