కాలుష్యం కారణంగా 2019లో ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల మంది మృత్యువాత పడ్డారు. గాలి, నీరు తదితర కాలుష్యాల వల్ల ఈ మరణాలు సంభవించాయి. ఆ ఏడాది ప్రతీ ఆరు మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగానే సంభవించడం గమనార్హం.
భారత్లో 23.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కాలుష్య మరణాల్లో భారత్ తొలి స్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలో ఉన్నది. ఈ మేరకు లాన్సెట్ ప్లానెటరీ నివేదిక వెల్లడించింది.