భోపాల్: ఆపరేషన్ సింధూర్ సమయంలో కనురెప్ప పాటులోనే పాకిస్థాన్ను మన సైనికులు మోకాళ్లపై కూర్చోబెటారని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో జరిగిన పీఎం మిత్ర పార్క్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. తన ప్రసంగంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మన సైనికులు ఇచ్చిన జవాబుకు.. పాకిస్థాన్ ఉగ్రవాదులు వెక్కి వెక్కి ఏడుస్తూ తమ దీన అవస్థను చెప్పుకుంటున్నారని మోదీ అన్నారు.
#WATCH | Dhar, Madhya Pradesh | Addressing a public rally, PM Modi says, “Abhi kal hi desh aur duniya ne dekha hai fir ek Pakistani aatanki ne ro ro kar apna haal bataya hai. Ye naya Bharat hai. Ye kisi ki parmanu dhamki se darta nahi hai… Ghar mein ghus ke maarta hai…”
“The… pic.twitter.com/ZP1oPOi9Nx
— ANI (@ANI) September 17, 2025
అయితే రెండు రోజుల క్రితమే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ ఒకరు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో మసూద్ అజార్ కుటుంబం ఛిన్నాభిన్నమైనట్లు పేర్కొన్న వీడియో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ వీడియోను ఉద్దేశి ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఉగ్రవాదులు ఏడ్చేస్తున్నారని తెలిపారు. ఇది నవ భారతం అని, అణు బెదిరింపులకు భయపడేది లేదని, ఉగ్రవాదుల ఇండ్లల్లోకి చొరబడి జవాబు ఇస్తామని మోదీ అన్నారు. మదర్ ఇండియా భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
మన అక్కాచెల్లెళ్లు, కూతుళ్ల సింధూరాన్ని పాక్ ఉగ్రవాదులు తుడిచేశారని, దానికి బదులుగా ఆపరేషన్ సింధూర్ చేపట్టి, పాక్లో ఉన్న ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు మోదీ చెప్పారు. కనురెప్ప పాటులోనే మన సైనికులు పాకిస్థాన్ లొంగిపోయేలా చేసినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్లో జరిగిన కార్యక్రమంలో మహిళల ఆరోగ్యం గురించి స్వస్త్ నారీ శశక్త్ పరివార్, రాష్ట్రీయ్ పోషన్ మా కార్యక్రమాలను మోదీ స్టార్ట్ చేశారు.