న్యూఢిల్లీ: పెట్రోల్, ఎల్పీజీ ధరల పెంపుదలను నిరసిస్తూ ఇవాళ విపక్షాలు రాజ్యసభలో ఆందోళన చేపట్టాయి. ప్లకార్డులు ప్రదర్శించిన విపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో చైర్మెన్ వెంకయ్యనాయుడు సభను తొలుత 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత రెండవసారి కూడా వెల్లోకి దూసుకువచ్చిన విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో డిప్యూటీ చైర్మెన్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. పెట్రోల్పై ఇవాళ 90 పైసలు, గ్యాస్ సిలిండర్పై రూ.50 పెంచిన విషయం తెలిసిందే. అంతకుముందు చైనాలో విమాన ప్రమాదంలో మృతిచెందిన వారికి సభ నివాళి అర్పించింది. దాదాపు 137 రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్పై ధరలను పెంచారు. చివరిసారి 2021, నవంబర్ 2వ తేదీన పెట్రోల్ ధరలు పెంచారు.