న్యూఢిల్లీ: అరుణాచల్లో చైనా చొరబాటుపై పార్లమెంట్ బుధవారం కూడా దద్దరిల్లింది. సమగ్ర చర్చకు ఉభయ సభల్లో విపక్ష పార్టీల సభ్యులు పట్టుబట్టారు. అనుమతించకపోవడంతో నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు రెండు సభల్లో వాకౌట్ చేశారు. లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ సున్నితమైన సరిహద్దు సమస్యపై పార్లమెంట్లో చర్చించకపోవడం దారుణమని కేంద్రంపై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ తీరును టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ ప్రశ్నించారు. అంతకుముందు కూడా పలు సమస్యలపై ప్రభుత్వం చర్చకు ముందుకు రానందుకు విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. సభ ప్రారంభంలో ఓ ఎంపీ ‘జస్టిస్ ఫర్ స్టాన్స్వామి’ ప్లకార్డు ప్రదర్శించారు.