బెంగళూరు : కర్ణాటకలో పెండింగ్ బిల్లులను చెల్లించడానికి అధికార కాంగ్రెస్ నేతలు కాంట్రాక్టర్ల నుంచి 8 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. ప్రభుత్వ వైఖరితో విసిగిపోతున్న కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులు చేయడానికి ముందుకు రావడం లేదని బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యెడియూరప్ప విమర్శించారు.
ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ బెంగళూరులో ఈ నెలాఖరులో మూడు రోజులపాటు ఆందోళన చేపడుతామని వెల్లడించారు.