బ్రసెల్స్, సెప్టెంబర్ 8: ఇండియా-భారత్ పేరు వివాదానికి కేంద్రంలోని బీజేపీకి పట్టుకున్న ఎన్నికల భయమే కారణమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధాని మోదీ ఓటమి భయంతో ఇండియా పేరును భారత్గా మార్చాలంటూ ప్రజల దృష్టిని మళ్లించే వ్యూహాలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.
యూరప్ పర్యటనలో భాగంగా బెల్జియంలోని బ్రసెల్స్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో ఇండియా అంటే భారత్ అని ఉందని గుర్తు చేశారు. అదానీ, క్రోనీ క్యాపిటలిజం వంటి అంశాలపై ఆరోపణలు రాగానే వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మోదీ ప్రభుత్వం వేరే అంశాలను తెరపైకి తెస్తున్నదని రాహుల్ విమర్శించారు.