భోపాల్: మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) సీహోర్ (Sehore) జిల్లాలో ఓ రెండున్నరేండ్ల చిన్నారి 300 అడుగుల లోతున్న బోరువావిలో పడిపోయింది. మంగళవారం మధ్యాహ్నం ముగవాళి (Mugavali) గ్రామానికి చెందిన శృష్టి కుశ్వాహా (Srishti Kushwaha) అనే బాలిక ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు వెళ్లి బోరుబావిలో (Borewell) పడినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 30 అడుగుల లోతులో చిన్నారి ఉన్నట్లు గుర్తించామన్నారు. దీంతో చిన్నారిని రక్షించేందుకు రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్ బృందం (NDRF), పోలీసు సిబ్బంది ఆపరేషన్ శృష్టి (Operation Srishti) పేరుతో ఆపరేషన్ మొదలుపెట్టారు. జేసీబీ, ఇతర యంత్రాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందం బోరుబావికి సమాంతరంగా గుంత తొవ్వడం ప్రారంభించారు.
అయితే గత 17 గంటలుగా కొనసాగుతన్న ఆపరేషన్కు బ్రేక్ పడింది. డ్రిల్లింగ్ చేయడంతో బాలిక మరో 20 ఫీట్ల లోతుకు జారినట్లు అధికారులు గుర్తించారు. ఈనేపథ్యంలో తొవ్వకం పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం ఆ చిన్నారి 50 ఫీట్ల లోతువద్ద ఉన్నట్లు తెలిపారు. బోర్వెల్ చుట్టూ డ్రిల్లింగ్ (Drilling) చేయడం వల్ల ఆపరేషన్ మరిత సంక్లిష్టంగా మారుతున్నదని సెహూర్ ఎస్పీ మయాంక్ అవస్థీ (SP Mayank Awasthi) చెప్పారు. వైబ్రేషన్ (Vibration) కారణంగా చిన్నారి మరింతకు కిందకు జారుతున్నదని, దీంతో ప్రస్తుత డ్రిల్లింగ్ ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించామన్నారు.https://twitter.com/PTI_News/status/1666281217900068868?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1666281217900068868%7Ctwgr%5Eb86516f3379d4cb9727f453e09261c17d4444c06%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Findia%2Fstory%2Fminor-girl-falls-into-borewell-in-mp-sehore-rescue-ops-on-2389741-2023-06-07
కాగా, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (CM Shivraj Singh Chouhan).. ఈ ఘటనపై ఆరా తీశారు. తన సొంత జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో.. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
सीहोर के ग्राम मुंगावली में मासूम बेटी के बोरवेल में गिरने की दुखद सूचना प्राप्त हुई, एसडीआरएफ की टीम तत्काल घटनास्थल पर पहुँच गई और बेटी को बोरवेल से निकालने की कार्यवाही प्रारंभ कर दी है।
मैंने स्थानीय प्रशासन को आवश्यक कदम उठाने के निर्देश दिये हैं। मैं भी सतत प्रशासन के…
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) June 6, 2023