ఉత్తరప్రదేశ్ ;ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రారంభించారు. యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్తో కలిసి స్వరవేద మహామందిర్కు ప్రారంభోత్సవం చేశారు. ఈ కేంద్రంలో ఒకేసారి 20 వేల మంది ధ్యానం చేసుకొనే సౌకర్యం ఉన్నది. వారణాసి నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ధ్యానకేంద్రాన్ని నిర్మించారు.