కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి
న్యూఢిల్లీ, మే 22: నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది నుంచి ఆన్లైన్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీఈటీ) నిర్వహిస్తామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆదివారం వెల్లడించారు. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ(ఎన్ఆర్ఏ) ద్వారా ఈ ఏడాది లోపు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.
కనీసం జిల్లాకో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రక్రియను సులభతరం చేస్తామని చెప్పారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ పరిధిలోని ఆరు స్వతంత్ర ప్రతిపత్తి సంస్థల సంయుక్త సమావేశం కేంద్రమంత్రి నేతృత్వంలో జరిగింది.