భువనేశ్వర్: అవును.. ఆ చిన్నారి మృత్యుంజయురాలు. ఆడుకుంటూ బోరు బావిలో పడిన ఏడాదిన్నర వయస్సు కలిగిన బాలిక సురక్షితంగా బయటపడింది. 15 అడుగుల లోతులో చిక్కుకున్న బాలికను పోలీసులు, సైన్యం దాదాపు 7 గంటలపాటు శ్రమించి క్షేమంగా బయటికి తీశారు.
మధ్యప్రదేశ్లోని ఛత్తర్పుర్ జిల్లా దౌనీ గ్రామంలో ఓ ఏడాదిన్నర చిన్నారి బోరుబావిలో పడిపోయింది. గురువారం మధ్యాహ్నం పొలంలో ఆడుకుంటున్న దివ్యాన్షి అనే బాలిక ప్రమాదవశాత్తు ఓ బోరుబావిలో జారి పడింది. చిన్నారి ఏడుపు విని అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు ఆమెను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో అధికారులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
బాలిక 15 లోతులో చిక్కుకు పోయిందని గుర్తించారు. 80 అడుగులున్న ఆ బావి చాలాకాలం క్రితమే ఎండిపోయిందని చెప్పారు. బోరుబావికి సమాంతరంగా గుంత తీశారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన రెస్య్కూ ఆపరేషన్ శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో చిన్నారిని క్షమంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె సురక్షితంగానే ఉందని తెలిపారు. ఈ ఆపరేషన్లో స్థానిక పోలీసులు, సైన్యం పాల్గొన్నది.