Encounter: జమ్ముకశ్మీర్లో ఏరివేసినా కొద్ది ఉగ్రవాదుల అలజడి కొనసాగుతూనే ఉన్నది. ఎంతమందిని హతమార్చినా పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు దేశంలో చొరబడుతూనే ఉన్నారు. ఇవాళ కూడా జమ్ముకశ్మీర్లోని సోపియాన్ జిల్లా కిల్బాల్ ఏరియాలో ఉగ్రవాదులు దాగి ఉన్నారని స్థానిక పోలీసులకు సమాచారం అందింది. దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఉగ్రవాదులు దాగివున్న ప్రదేశాన్ని చుట్టుముట్టారు.
ఉగ్రవాదులను లొంగిపోవాలని హెచ్చరించారు. కానీ వాళ్లు కాల్పులకు దిగడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతున్నది. మరణించిన ఉగ్రవాదికాక అవతలి వైపు నుంచి మరో ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.