శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. షోపియాన్లోని (Shopian) చెర్మార్గ్, జైన్పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు.
ప్రతిగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. అతడు ఏ గ్రూప్నకు చెందినవాడనే విషయం ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. ఆపరేషన్ కొనసాగుతున్నదని వెల్లడించారు.