రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. తాడిమెట్ల అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఘటనాస్థలి నుంచి మృతదేహాంతో పాటు ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పలువురు మావోయిస్టులు చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాల్పుల ఘటనను సుక్మా ఎస్పీ ధృవీకరించారు.