chhattisgarh | కొత్తగూడెం క్రైం: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనలో ఓ మావోయిస్టు మృతిచెందాడు.
సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. దండకారణ్యంలోని బుర్కలంక అటవీప్రాంతంలో డీఆర్జీ భద్రతా దళాలు శుక్రవారం రాత్రి నుంచి మావోయిస్టుల కోసం సెర్చింగ్ ఆపరేషన్ చేపడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం జవాన్లకు మావోయిస్టులు తారసపడి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఇరువర్గాల మధ్య సుమారు 20 నిమిషాల పాటు భీకర పోరు జరిగింది. జవాన్ల ధాటికి తాళలేని మావోయిస్టులు కాల్పులు జరుపుతూ దట్టమైన అటవీప్రాంతంలోకి పరారయ్యారు. అనంతరం జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఓ మావోయిస్టు మృతదేహాన్ని గుర్తించారు.