IED blast : నక్సలైట్లు పాతిపెట్టిన మందుపాతర పేలడంతో ఒక జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాయ్గూడెం, తుమల్పాడ్ గ్రామాల మధ్య నక్సలైట్లు ప్రెషర్ కుక్కర్లో పేలుడు పదార్థాలు నింపి పాతిపెట్టారు. పేలుడులో తీవ్రంగా గాయపడిన జవాన్ను భద్రతా బలగాలు ఆస్పత్రికి తరలించాయి.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ మధ్య కాలంలో ఛత్తీస్గఢ్లో తరచూ ఎన్కౌంటర్లు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఎన్కౌంటర్లలో పలువురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. జవాన్లలో కూడా కొందరు గాయపడ్డారు. ఈ క్రమంలో తాజాగా మందుపాతర పేలుడు ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.