జునాగడ్: గుజరాత్లోని జునాగడ్లో జరిగిన తాజా హింసాత్మక(Junagadh violence) ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. రాళ్లు రువ్విన ఘటనలో ఓ కొందరు పోలీసులు గాయపడ్డారు. అక్రమ రీతిలో నిర్మించిన మసీదును తొలగించేందుకు యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ చేపట్టారు. ఆ సమయంలో ఘర్షణలు తలెత్తాయి. నిరసన చేపడుతున్న స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గుంపును చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్కు దిగారు. నగరంలోని మేజెవాడి గేటు వద్ద నిర్మించిన మసీదుకు వారం క్రితమే జునాగడ్ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చినట్లు ఎస్పీ రవి తేజ తెలిపారు. ఆ నిర్మాణానికి సంబంధించిన డాక్యుమెంట్లను అయిదు రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించారు.
#WATCH | Stones pelted, cops injured after a mob protest against the anti-encroachment drive in Gujarat's Junagadh last night
(Note: Abusive language) pic.twitter.com/8wRw0YgO3z
— ANI (@ANI) June 17, 2023
శుక్రవారం రోజున సుమారు ఆరు వందల మంది ఆ మసీదు ప్రాంతంలో నిరసన చేపట్టారని, రోడ్డును అడ్డుకోవద్దు అని ఆ నిరసనకారుల్ని కోరామని, రాళ్లు రువ్విన ఘటన రాత్రి 10.15 నిమిషాలకు జరిగినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో సుమారు 174 మందిని రౌండప్ చేసినట్లు వెల్లడించారు.