భోపాల్: ఒక యువ పాత్రికేయుడిని కొందరు చెట్టుకు కట్టేసి కొట్టిన సంఘటన మధ్యప్రదేశ్లో హోసంగాబాద్లో జరిగింది. ఈ ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. ఒక టీవీ, ఆన్లైన్ న్యూస్ సంస్థలో పనిచేస్తున్న ప్రకాశ్ (25) ఈ నెల 1న గ్రామంలో జరిగిన చిన్న వాగ్వాదాన్ని వీడియో తీశాడు.
దీనిపై కక్ష పెంచుకున్న గ్రామానికి చెందిన నారాయణ్ యాదవ్, అతని సోదరుడు, మరో నలుగురు బైక్పై వస్తున్న ప్రకాశ్ను అడ్డుకుని గొడవను ఎందుకు వీడియో తీశావని దూషిస్తూ అతడి కడుపులో గుద్ది దాడి చేశారు.